మెయిల్ ఐడీ మార్చి.. నగదు కొల్లగొట్టి
విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన బ్యాంక్ ఉద్యోగి కొల్లు నాగేశ్వరరావు.. క్రెడిట్ కార్డులు పొందిన నిరక్షరాస్యులను టార్గెట్గా చేసుకుని వారి ఖాతాలో నగదు మాయం చేస్తున్నట్టు నగరంపాలెం ఇన్ఛార్జి ..
గుంటూరు: విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన బ్యాంక్ ఉద్యోగి కొల్లు నాగేశ్వరరావు.. క్రెడిట్ కార్డులు పొందిన నిరక్షరాస్యులను టార్గెట్గా చేసుకుని వారి ఖాతాలో నగదు మాయం చేస్తున్నట్టు నగరంపాలెం ఇన్ఛార్జి సీఐ రత్నస్వామి తెలిపారు. ఈనెల 2న గుంటూరికి చెందిన తోట శ్రీకాంత్ తన క్రెడిట్ కార్డు నుంచి రూ.2,53,250 నగదు మాయమైనట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
సీఐ కథనం ప్రకారం.. గుంటూరు వెంకటరమణ కాలనీకి చెందిన తోట శ్రీకాంత్ ద్విచక్రవాహనాల మెకానిక్ దుకాణం నిర్వహిస్తుంటాడు.ఐదేళ్లుగా కొటక్ మహేంద్రబ్యాంక్ క్రెడిట్కార్డు ఉపయోగిస్తున్నాడు. ఈనెల 2న మధ్యాహ్నం తన చరవాణికి క్రెడిట్కార్డు ద్వారా రూ.2,53,250 వాడుకున్నట్టు సంక్షిప్త సందేశం వచ్చింది. ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా నగదు వాడుకున్నట్టు సందేశం రావడంతో ఆందోళనకు గురైన బాధితుడు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కృష్ణా జిల్లా విజయవాడకి చెందిన కొల్లు నాగేశ్వరరావు ఎంబీఏ పూర్తి చేసి నగరంలోని కొటక్ మహేంద్ర బ్యాంకులో క్రెడిట్కార్డు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన నాగేశ్వరరావు సునాయాసంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. క్రెడిట్కార్డు పొందిన వారిలో సాంకేతిక పరిజ్ఞానం లేనివారిని, నిరక్షరాస్యులను టార్గెట్గా చేసుకున్నాడు. క్రెడిట్కార్డు పొందే సమయంలో వారు ఇచ్చే మెయిల్ ఐడీలను మార్చి కొత్త మెయిల్ ఐడీని క్రియేట్ చేసి వాటి సాయంతో ఓటీపీ తెలుసుకుని నగదు మాయం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు నాగేశ్వరరావు ఈరోజు మధ్యాహ్నం గుంటూరుకి చెందిన శ్రీకాంత్ క్రెడిట్కార్డుతో బంగారు దుకాణంలో ఆభరణాలు కొనుగోలు చేశాడు. దుకాణం యజమానికి మెసేజ్ వచ్చింది కానీ నగదు జమకాలేదు. ఎంత సేపటికి నగదు ఖాతాలోకి జమకాకపోవడం గమనించిన నిందితుడు అక్కడి నుంచి జారుకున్నాడు. దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ జరిగిందని బాధితుడు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అకౌంట్ ఫ్రీజ్ చేశామని, అందుకే బంగారు దుకాణంలో నగదు బదిలీ కాలేదని సీఐ తెలిపారు. నాగేశ్వరరావును అరెస్టు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టు సీఐ రత్నస్వామి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ