Emergency Landing: విమానం మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండ్.. ప్రయాణికుడి మృతి
కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి దిల్లీకి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే విమానాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది...
ఇండోర్: కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి దిల్లీకి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే విమానాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విస్టారా విమానం యూకే- 818 గురువారం సాయంత్రం బెంగళూరు నుంచి దిల్లీకి బయల్దేరింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న దిల్లీకి చెందిన మనోజ్ కుమార్ అగర్వాల్కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. కొద్ది సేపటికే మూర్చపోవడంతో.. ఈ మేరకు సమాచారం అందుకున్న పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించారు.
రాత్రి 9.30 గంటల సమయంలో ఇండోర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంలో మెడికల్ ఎమర్జెన్సీ కింద ల్యాండ్ చేశారు. ఎయిర్పోర్ట్ ఇన్ఛార్జి డైరెక్టర్ ప్రమోద్ కుమార్ శర్మ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలుస్తోందని ఆ ఆసుపత్రి డైరెక్టర్ డా.సునీల్ బాంతియా చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఏరోడ్రోమ్ పోలీస్స్టేషన్ అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా