Triple Suicide: ఇంటిని గ్యాస్ ఛాంబర్గా మార్చి.. ఊపిరాడకుండా చేసుకొని..!
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ యాభైనాలుగేళ్ల మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దిల్లీలో తల్లి సహా ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ యాభైనాలుగేళ్ల మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. , ఇంటిని మొత్తం గ్యాస్ ఛాంబర్గా మార్చి.. ఊపిరాడకుండా చేసుకొని మరణించడం ప్రతిఒక్కరిని కలచి వేస్తోంది. అంతేకాకుండా ఇంట్లోకి వచ్చిన వారు నిప్పు వెలిగించవద్దని.. అలా చేస్తే మరింత ప్రమాదం సంభవిస్తుందని అప్రమత్తం చేస్తూ సూసైడ్ నోట్లో పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది.
దక్షిణ దిల్లీలోని వసంత్ విహార్లో మంజు (54) అనే మహిళ ఇద్దరు కుమార్తెలు అన్షిక (27), అంకూ (25)లతో కలిసి నివాసం ఉంటోంది. మంజూ భర్త కొవిడ్ కారణంగా గతేడాదే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి తీవ్ర కుంగుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే, శనివారం సాయంత్రం వరకూ మంజు ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రాకపోవడంతోపాటు లోపలి నుంచి తాళం వేసినట్లు గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ఇంటి తలుపులు తెరచి లోనికి ప్రవేశించగా.. బెడ్రూమ్లో ముగ్గురు విగతజీవులుగా పడివున్నట్లు కనుగొన్నారు. వారి పక్కనే సూసైడ్ నోట్నూ గుర్తించారు. ఇంటి వాతావరణాన్ని పరిశీలించిన పోలీసులు.. ఇంటిని మొత్తం గ్యాస్ ఛాంబర్గా మార్చడం వల్ల ఊపిరాడకనే మరణించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారకు వచ్చారు.
నిప్పు రగిలించొద్దు..
సూసైడ్ నోట్ ప్రకారం.. తొలుత ఇంట్లోని కిటికీలను పాలిథిన్ కవర్తో ప్యాక్ చేశారు. అనంతరం గ్యాస్ సిలిండర్ను ఓపెన్ చేసి ఇంటిని మొత్తం గ్యాస్ ఛాంబర్గా మార్చారు. అంతేకాకుండా ‘చాలా ప్రమాదకర వాయువుతో ఇల్లు నిండివుంది. అగ్గిపుల్ల లేదా లైటర్ను వెలిగించవద్దు. ఇల్లు మొత్తం చాలా ప్రమాదకరమైన విషవాయువు (కార్బన్ మోనాక్సైడ్)తో నిండిపోయింది. ఈ వాయువును కూడా పీల్చవద్దు’ అని హెచ్చరిస్తూ లేఖలో పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఊపిరాడకపోవడంతోనే మంజు సహా ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది తన భర్త మరణించడం, మంజు ఆరోగ్యం కూడా ఇటీవల సరిగా లేకపోవడం వంటి కారణాలు వారిని ఆత్మహత్యను ప్రేరేపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!