Crime news: కూతుళ్ల కళ్లముందే తండ్రిని చంపేసిన దుండగులు

కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు దుండగులు ఓ వ్యక్తిని తన ఇద్దరు కూతుళ్ల కళ్లముందే అతి కిరాతకంగా హత్య చేశారు.....

Published : 23 Nov 2021 02:14 IST

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో దారుణం వెలుగుచూసింది. నలుగురు దుండగులు ఓ వ్యక్తిని తన ఇద్దరు కూతుళ్ల కళ్లముందే అతి కిరాతకంగా హత్య చేశారు. బిహార్‌కు చెందిన దీపక్‌ కుమార్‌ సింగ్‌ (46).. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి నలుగురు దుండగులు దీపక్‌ ఇంట్లోకి చొరబడి ఆయన ఇద్దరు కూతుళ్లు చూస్తుండగానే ఆయుధాలతో దాడిచేసి కిరాతకంగా చంపారు.

అయితే, దీపక్‌ కుమార్‌ గత ఏడాదిన్నరగా తన కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఇద్దరు యువతులూ తన తల్లితో పాటు కళాశాలలోని మిత్రులకు చెప్పినట్టు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు కూడా దీపక్‌ కుమార్‌ సింగ్‌ తాగి వచ్చి కూతుళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. దీపక్‌ హత్య వెనుక ఆయన కుమార్తెలు చదువుతున్న కళాశాల స్నేహితులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని