Crime news: రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్‌ కేరళ, రన్నరప్‌ దుర్మరణం

కేరళలో విషాదం చోటుచేసుకుంది. కోచికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్‌ కేరళ అన్షీ కబీర్ (24)‌, 2019లో ఆమెతో పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన అంజనా షాజన్‌ (25)...

Updated : 02 Nov 2021 14:03 IST

కోచి: కేరళలో విషాదం చోటుచేసుకుంది. కోచికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్‌ కేరళ అన్షీ కబీర్ (24)‌, 2019లో ఆమెతో పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన అంజనా షాజన్‌ (25) దుర్మరణం చెందారు. కోచికి సమీపంలోని వైటిల్లా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రమాదం సమయంలో కేవలం డ్రైవర్‌ మాత్రమే సీటు బెల్టు ధరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. అన్సు కబీర్‌ది తిరువనంతపురం కాగా.. అంజనా షాజన్‌ కోచికి చెందినవారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని