తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు వర్కర్లతో వస్తున్న వ్యాన్‌, ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొట్టిన ఘటనలో.....

Updated : 30 Mar 2021 12:25 IST

నలుగురి మృతి; 60మందికి పైగా గాయాలు

దిండిగల్‌: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు వర్కర్లతో వస్తున్న వ్యాన్‌, ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 60మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు  వెల్లడించారు. మృతుల్లో వ్యాన్‌ డ్రైవర్‌ కూడా ఉన్నట్టు తెలిపారు. దిండిగల్‌ జిల్లాలోని వతలగుండు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని