పెళ్లికి తయారు.. వరుడు పరారు!
‘‘మన కులాలు వేరైనా మనం ఒకటే.. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నాం.. మా అమ్మానాన్నలను ఒప్పించా.. ఎల్లుండి ప్యారడైజ్ కన్వెన్షన్లో పెళ్లి.. నా పేరుమీద బుక్ చేశాను..ఉదయాన్నే మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో కలిసి వచ్చేయండి..
సహజీవనం చేసి మోసం
హైదరాబాద్: ‘‘మన కులాలు వేరైనా మనం ఒకటే.. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నాం.. మా అమ్మానాన్నలను ఒప్పించా.. ఎల్లుండి ప్యారడైజ్ కన్వెన్షన్లో పెళ్లి.. నా పేరుమీద బుక్ చేశాను..ఉదయాన్నే మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో కలిసి వచ్చేయండి.. పెళ్లయ్యాక ఇద్దరమే ముంబయి, దిల్లీకి వెళ్దాం... మా అమ్మ తనకున్న నగలన్నీ నీకే ఇచ్చేస్తానంటూ చెప్పింది... పెళ్లికి పట్టుచీర కూడా తీసుకువస్తానంది.. మా నాన్న మొదట్లో అభ్యంతరం చెప్పినా.. తర్వాత సరేనన్నారు. మన ఆఫీస్ సిబ్బంది అందరికీ ఫోన్ చేశాను. పెళ్లికి వచ్చే వారందరికీ అల్పాహారం ఇవ్వాలంటూ హోటల్ వారిని అభ్యర్థించానం’’టూ ఒక యువకుడు.. తన ప్రియురాలికి ఫోన్ చేశాడు. అతడి మాటలు నమ్మి సికింద్రాబాద్ ప్యారడైజ్ కన్వెన్షన్కు కోటి ఆశలతో వెళ్లిన ఆ యువతి ఒక్కసారిగా అక్కడ పెద్ద తాళాన్ని చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది..అక్కడున్న వారిని సంప్రదించగా.. పెళ్లి లేదు... నిశ్చితార్థం లేదు... వెళ్లండి అంటూ చెప్పారు. అక్కడి నుంచే తన ప్రియుడికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తనను మోసం చేశాడని గ్రహించిన ఆమె సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది.
పనిచేసే చోట పరిచయం.. సికింద్రాబాద్లో నివాసముంటున్న యువతి బేగంపేటలోని బహుళజాతి కంపెనీలో ఐటీ విభాగంలో నాలుగేళ్లుగా పనిచేస్తోంది. అదే కంపెనీలో మాసాబ్ట్యాంక్లోని శాంతినగర్లో నివాసముంటున్న ప్రవీణ్ మూడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం ప్రవీణ్ను కూడా ఐటీ విభాగంలోకి మార్చారు. అప్పటి నుంచి ప్రవీణ్ సదరు యువతితో మాట్లాడేవాడు. ప్రవీణ్కు అవసరమైనప్పుడు ఆమె ఆర్థికంగా సాయపడేది.
పెళ్లి ప్రతిపాదన.. సహజీవనం... తాను తన తల్లిదండ్రులను ఒప్పిస్తాననంటూ చెప్పడంతో ప్రవీణ్తో పెళ్లికి ఒప్పుకొంది. ఆమెను బాపట్లలో ఉంటున్న తన బంధువులకు తన కాబోయే భార్య అని చెప్పాడు. కానీ అతని తల్లిదండ్రులు వీరి పెళ్లికి నిరాకరించారు. అయితే నవంబరు 13న ప్యారడైజ్లో పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. ప్రవీణ్ చెప్పిన రోజు అక్కడి వెళ్లగా.. ప్రవీణ్ ఎవరో తెలియదంటూ నిర్వాహకులు ఆమెకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ