ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ సభ్యుల పరస్పర దాడి
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కార్యకర్తల మధ్య జరిగిన కొట్లాటలో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. దిల్లీలోని జేఎన్యూ విద్యార్థులపై దాడికి నిరసనగా ..
10 మందికి గాయాలు
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కార్యకర్తల మధ్య జరిగిన కొట్లాటలో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. దిల్లీలోని జేఎన్యూ విద్యార్థులపై దాడికి నిరసనగా అహ్మదాబాద్లోని ఏబీవీపీ కార్యాలయం ఎదుట ఎన్ఎస్యూఐ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలు వీరిపై దాడికి దిగారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది.
మరోవైపు ఈ దాడిని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు నీరజ్కుందన్ తీవ్రంగా ఖండించారు. భాజపా నిరంకుశ ప్రవర్తన ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భాజపా నిజరూపం ఇప్పుడు బయటపడింది. ఆ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తోంది’’ అని ఆరోపించారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై దాడిని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. నేరస్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసింది. ‘‘ ఇది ఏబీవీపీ గూండాలు చేసిన దుశ్చర్య. దీనిలో వారి అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. అమాయక విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని భాజపా ఎలా సమర్థిస్తుంది. భారత్ను రణక్షేత్రంగా తయారు చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఆదివారం రాత్రి దిల్లీ జేఎన్యూలో జరిగిన దుండగుల దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ సహా మరో 34 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఏబీవీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని జేఎన్యూ విద్యార్థి సంఘం ఆరోపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు