పెళ్లి మండపానికి వస్తున్న వరుడి కాల్చివేత
మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుందనగా వరుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.
అజాంగఢ్ (ఉత్తర్ ప్రదేశ్): మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుందనగా వరుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ దుర్ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని దేవ్గావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మసీర్పూర్ బజార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...
పెళ్లి ఊరేగింపు సింగ్పూర్ ప్రాంతం నుంచి బయలుదేరి వివాహ ప్రదేశానికి వచ్చింది. పెళ్లికుమారుడు మండపానికి వస్తుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. వరుడిని వెంటనే బంధువులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
వరుడి మృతితో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించి వరుడు, వధువు కుటుంబసభ్యులను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హంతకులు వరుడి ఊరేగింపును కొద్ది దూరం నుంచి వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరాలు లేవని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.