బిహార్‌లో బాంబు పేలుడు..!

బిహార్‌లో ఓ ఇంట్లో సంభవించిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పట్నాలోని......

Published : 10 Feb 2020 11:28 IST

పట్నా: బిహార్‌లో ఓ ఇంట్లో సంభవించిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పట్నాలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇంటితో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా ధ్వంసమైంది. ఇంట్లో అక్రమంగా దాచిన బాంబు వల్లే ఈ పేలుడు సంభవించి ఉంటుందని పట్నా పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని