తమ్ముడి మృతి తట్టుకోలేక...

అనారోగ్యంతో తమ్ముడు మృతి చెందితే... ఆ విషాదాన్ని తట్టుకోలేక కొన్ని గంటల వ్యవధిలో ఆయన అన్న కూడా అసువులు బాసిన సంఘటన ఇది. మహబూబాబాద్‌ గ్రామీణ మండలంలోని సింగారం గ్రామ సర్పంచి గంగుల తేజమ్మ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి స్వయానా అక్క.

Updated : 13 Feb 2020 08:47 IST

 గంటల వ్యవధిలో కన్నుమూసిన అన్న
 మృతుల్లో ఒకరు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బావ

మహబూబాబాద్‌ రూరల్‌ : అనారోగ్యంతో తమ్ముడు మృతి చెందితే... ఆ విషాదాన్ని తట్టుకోలేక కొన్ని గంటల వ్యవధిలో ఆయన అన్న కూడా అసువులు బాసిన సంఘటన ఇది. మహబూబాబాద్‌ గ్రామీణ మండలంలోని సింగారం గ్రామ సర్పంచి గంగుల తేజమ్మ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి స్వయానా అక్క. ఆమె భర్త గంగుల రామలింగయ్య (75). ఆయన సోదరుడు గంగుల నారాయణ (60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. తమ్ముడి మృతిని తట్టుకోలేక విలపించిన రామలింగయ్య కూడా ఉదయం 11 గంటలకు తనువు చాలించారు. ఒకే రోజు సోదరులిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కడియం శ్రీహరి గ్రామానికి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని