ముంబయి జీఎస్టీ భవనంలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర ముంబయిలోని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కార్యాలయంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు ఆర్పేందుకు దాదాపు 16 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి.

Published : 17 Feb 2020 16:05 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కార్యాలయంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు ఆర్పేందుకు దాదాపు 16 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం.. మజగావ్ ప్రాంతంలోని జీఎస్టీ కార్యాలయం 8వ అంతస్థులో ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటల్ని ఆర్పేందుకు 16 ఫైరింజన్లు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన చెప్పారు. ప్రమాదానికి గల కారణాల్ని విచారణలో కనుగొనాల్సి ఉందని తెలిపారు. ముంబయిలో ఉన్న ఈ 9 అంతస్థుల భవనాన్ని గతంలో సేల్స్‌ ట్యాక్స్‌ కార్యాలయంగా పిలిచేవారు. కాగా కేంద్రం వస్తుసేవల పన్ను అమల్లోకి తెచ్చినప్పటి నుంచి దీని పేరు జీఎస్టీ కార్యాలయంగా మారింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని