సూట్కేసులో ప్రియుడి మృతదేహం
అమెరికాలో ఉంటున్న జంట ఓ రోజు ఆనందంగా గడిపింది. మరుసటి రోజు ప్రియుడు మాత్రం అనుమానాస్పదస్థితిలో సూట్కేసులో మృత్యువై ఉన్నాడు. ..
ఫ్లోరిడా: అమెరికాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే అతడి ప్రేయసిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు వింత సమాధానం వచ్చింది. దాగుడుమూతలు ఆడే క్రమంలోనే తన ప్రియుడు మరణించాడని చెప్పడంతో విస్తుపోవడం పోలీసుల వంతయ్యింది.
ఫ్లోరిడా వింటర్ పార్క్లో నివసిస్తున్న సారా బూనే అనే మహిళ తన ప్రియుడు జార్జ్ టొర్రెస్ (42) మరణించాడని పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్కేసులో ఉన్న ప్రియుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో బూనేను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘రాత్రి ఇద్దరం సరదాగా గడుపుతున్న సమయంలో ఓ బ్యాగులో ఉండి దాగుడుమూతలు ఆడుకుంటే ఫన్నీగా ఉంటుందని అనుకున్నాం. దీనికి ఒప్పుకున్న ప్రియుడు టొర్రెస్ సూట్కేసులో దూరాడు. నేను అంతస్తుకి వెళ్లి నిద్రపోయాను. ఉదయాన్నే లేచి సూట్కేసుని తెరచి చూసే సరికి టొర్రెస్ అపస్మారకస్థితిలో ఉండటం గమనించాను’’ అని ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు ఆ మహిళ మొబైల్ను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న వీడియోలను పరిశీలించారు. సూట్కేసులో ఉన్న ప్రియుడు సాయం కోసం అరుస్తున్నట్లు ఆ వీడియోల్లో ఉందని గమనించారు. టొర్రెస్ సూట్కేసునుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ప్రేయురాలు నవ్వుతూ..నువ్ నన్ను మోసం చేసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించిందనే వాదనలు వినిపించాయని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, దాగుడుమూతలు ఆడే సమయంలోనే తన ప్రియుడు మరణించాడని చెబుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం ప్రేయసిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం