ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వెళ్తూ..

రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం చెందిగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన బండిపాడు ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల

Updated : 17 Mar 2020 13:28 IST

కామేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం చెందిగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన బండిపాడు ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన లెనిన్‌కుమార్‌, డోర్నకల్‌కు చెందిన మామిడి వివేక్‌ ఖమ్మంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చివరి పరీక్ష రాసేందుకు మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై బయల్దేరారు. డోర్నకల్‌ -కొత్తలింగాల ప్రధాన రహదారిపైకి రాగానే బండిపాడు మూలమలుపు వద్ద ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో స్థానికులు గుర్తించి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే మామిడి వివేక్‌(16) మృతి చెందాడు. లెనిన్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని