ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తూ..
రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి దుర్మరణం చెందిగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన బండిపాడు ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల
కామేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి దుర్మరణం చెందిగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన బండిపాడు ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన లెనిన్కుమార్, డోర్నకల్కు చెందిన మామిడి వివేక్ ఖమ్మంలో ఇంటర్ మొదటి సంవత్సరం చివరి పరీక్ష రాసేందుకు మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై బయల్దేరారు. డోర్నకల్ -కొత్తలింగాల ప్రధాన రహదారిపైకి రాగానే బండిపాడు మూలమలుపు వద్ద ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో స్థానికులు గుర్తించి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే మామిడి వివేక్(16) మృతి చెందాడు. లెనిన్కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా