యువతుల ఆత్మహత్య..పక్కనే చిన్నారి మృతదేహం!
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. డెంటల్ కాలేజీ సమీపంలోని డంపింగ్...
జవహర్నగర్ : మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు ఇద్దరు మహిళలు సహా ఐదేళ్ల చిన్నారిని బలి తీసుకున్నాయి. రేషన్కు వెళ్లి ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చారని భర్తలు అడగటమే వారి పాలిట మృత్యుశాసనమైంది. అభం శుభం తెలియని చిన్నారికి నూరేళ్లు నిండేలా చేసింది. రెండు కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగిల్చిన ఈ సామూహిక మరణాలు స్థానికంగా కలకలం రేపాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
మృతులు అనూష, సుమతి, ఉమామహేశ్వరి 3 రోజుల క్రితం కరీంనగర్ జవహర్నగర్లోని గబ్బిలాలపేటకు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో తల్లి అనూష, కుమార్తె ఉమామహేశ్వరికి శీతల పానీయంలో రసాయనాలు కలిపి తాగించి అనంతరం చిన్నారి మెడకు చున్నీ బిగించిందని, చిన్నారి చనిపోయిందని నిర్ధారించుకున్నాక మిగిలిన ఇద్దరూ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. శామీర్పేట మీదుగా జవహర్ నగర్ చేరుకున్న వీరికి..స్థానికంగా ఓ చర్చిలో ఆశ్రయం దొరికినట్లు గుర్తించారు.
వెల్గటూరు మండలం అంబారిపేటకు చెందిన సుమతి కుటుంబం జీవనోపాధి కోసం 22 ఏళ్ల క్రితమే కరీంనగర్కు వలస వచ్చారు. ప్రస్తుతం కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో నివాసం ఉంటున్నారు. సుమతి ఏడేళ్ల క్రితం మర్రిపల్లికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తమ వద్దకు రావడం లేదని, తమతో మాట్లాడటం మానేసిందని, తాము కూడా ఆమె గురించి అంతగా పట్టించుకోలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. భర్త కారు డ్రైవర్గా పని చేస్తూ స్థానిక జ్యోతినగర్లోని కుర్మవాడ బిల్డింగ్లో అద్దెకు ఉంటున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.