రెండు నెలలుగా ఎయిర్పోర్టులోనే నేరస్థుడు!
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత్లో విధించిన లాక్డౌన్ కారణంగా దిల్లీ విమానాశ్రయంలో ఓ అరుదైన సంఘటన జరిగింది.
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత్లో విధించిన లాక్డౌన్ కారణంగా ఓ నేరస్థుడు దిల్లీ విమానాశ్రయంలోనే గడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనుకోకుండా ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి.. గత 50రోజులుగా విమానాశ్రయంలోనే గడుపుతున్నాడు. అతని పూర్తి వివరాలు సేకరించగా అతడో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తేలింది.
జర్మనీకి చెందిన ఎడ్గార్డ్ జైబాట్ అనే 40ఏళ్ల వ్యక్తి మార్చి 18న వియాత్నం నుంచి భారత్ మీదుగా ఇస్తాంబుల్ బయలుదేరాడు. మార్గమధ్యంలో దిల్లీ విమానాశ్రయం చేరుకున్న సమయంలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో టర్కీకి రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో అన్ని రకాల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో విమానాశ్రయంలో చిక్కుకున్న కొందరి విదేశీ ప్రయాణికులకు వారి రాయబార కార్యాలయాలు తోడ్పాటునందించాయి. కానీ జర్మనీకి చెందిన జైబాట్ మాత్రం దిల్లీ విమానాశ్రయంలోనే ఉండిపోయాడు. ఇది గమనించిన విమానాశ్రయ సిబ్బంది జర్మనీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా అతడో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తేలింది. దాడులతో పాటు ఇతర నేరపూరిత కేసులు అతడిపై ఉన్నట్లు వెల్లడించింది. దీంతో జర్మనీ రాయబార కార్యాలయం అతడికి సహకరించకపోగా.. విదేశంలో ఉన్న కారణంగా అతడిని కస్టడీలోకి తీసుకునేందుకు నిరాకరించింది.
విమానాశ్రయం నుంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా వీసా ఉండాలి. కానీ అతనికున్న నేరచరిత్ర కారణంతో భారత్ కూడా వీసా ఇవ్వలేదు. దీంతో గత 50రోజులుగా దిల్లీ విమానాశ్రయంలోనే ఉండిపోయాడని అక్కడి సిబ్బంది వెల్లడించారు. టెర్మినల్లో ఉన్న ఫుడ్ కోర్టుల్లో ఆహారం తింటూ, అక్కడి సిబ్బందితో కాలక్షేపం చేస్తున్నాడు. అక్కడే కుర్చీలు, నేలపై నిద్రిస్తున్నాడు. అయితే, టెర్మినల్ లోపల ఉన్న అతని కదలికలను సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం టర్కీకి వెళ్లిన ప్రత్యేక విమానంలో పంపించేందుకు ప్రయత్నించినప్పటకీ అక్కడి అధికారులు నిరాకరించారు. ఆ విమానంలో కేవలం టర్కీ దేశీయులకు మాత్రమే అనుమతినిచ్చారు. అయితే, అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైన వెంటనే అతన్ని పంపించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!