కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య
పాత కక్షల నేపథ్యంలో యువకుడిని ప్రత్యర్థులు దారుణంగా అంతమొందించిన ఘటన సోమవారం మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్పీ కాలనీలో
జగద్గిరిగుట్టలో ఘటన
జగద్గిరిగుట్ట (మేడ్చల్): పాత కక్షల నేపథ్యంలో యువకుడిని ప్రత్యర్థులు దారుణంగా అంతమొందించిన ఘటన సోమవారం మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్పీ కాలనీలో నివాసముండే ఫయాజ్ (25) ఆటోడ్రైవర్గా పని చేసేవాడు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఫయాజ్ కొంతకాలంగా ఇక్కడ నివాసముంటున్నాడు. తాను నివాసముండే కాలనీలో కొందరితో అతడికి విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో పలుమార్లు గొడవలు చోటు చేసుకున్నాయి. మూడు రోజుల క్రితం కూడా గొడవ పడ్డారు.
ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఫయాజ్ను అడ్డగించిన గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో వెంటాడారు. పలుచోట్ల పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రాణ భయంతో పరుగులు తీసిన ఫయాజ్ ఓ ఇంటి ముందు పడిపోగా.. హంతకులు మరోసారి కత్తులతో పొడిచి పరారయ్యారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సుమారు 10 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీం సాయంతో మృతుడి వద్ద వస్తువులు, ఇతర ఆధారాలు సేకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!