పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగిన తల్లి
భర్త వేధింపులకు విసుకు చెందిన ఓ భార్య తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, తానూ తాగిన ఘటన శామీర్పేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ సంతోశం తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లాకు చెందిన గోపీనాథ్కు ప్రీతి అనే మహిళతో
చిన్నారులు మృతి.. విషమంగా తల్లి పరిస్థితి
శామీర్పేట: భర్త వేధింపులకు విసుకు చెందిన ఓ భార్య తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, తానూ తాగిన ఘటన శామీర్పేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ సంతోశం తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లాకు చెందిన గోపీనాథ్కు ప్రీతి అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరు మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని మజీద్పూర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు గౌరవ్(4), కౌశిక్(3) ఉన్నారు. గోపీనాథ్ తుర్కపల్లి బయోటెక్ జీనోమ్ వ్యాలీలోని ఓ ల్యాబ్లో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంత కాలంగా కుటుంబ సమస్యల కారణంగా భార్యాభర్తలిద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏదో విషయమై దంపతులిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ప్రీతి బుధవారం తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు వారిని మేడ్చల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్పేట ఎస్సై గణేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.