బిడ్డను చంపి దంపతుల ఆత్మహత్య

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్యభర్తలిద్దరూ కలిసి కన్న బిడ్డనే హతమార్చి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఐ శ్యాంసుందర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 21 May 2020 03:07 IST

డోర్నకల్‌: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్యభర్తలిద్దరూ కలిసి కన్న బిడ్డనే హతమార్చి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఐ శ్యాంసుందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మన్నెగూడెం గ్రామానికి చెందిన అక్కె రాంబాబు(27), కృష్ణవేణి(24)లకు ఐదేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఈ మధ్య కాలంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.ఈ క్రమంలో నెల రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. చిల్కోయిలపాడులో ఉన్న భార్య, 9 నెలల కూతురు చైత్రికను తీసుకొచ్చేందుకు ఇవాళ రాంబాబు అక్కడికి వెళ్లాడు. తిరిగి వస్తూ ద్విచక్రవాహనాన్ని తన పొలం వైపు తీసుకెళ్లి, అక్కడ కూతురు గొంతునులిమి చంపేసి సమీపంలోని నీటి కుంటలో పడేశారు. అనంతరం వీరిద్దరూ అక్కడున్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోవడానికి మునుపు రాంబాబు తన మరదలకి ఫోన్‌ చేసి తాము చనిపోతున్నట్లు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తల్లిదండ్రులతో రాకుండా అమ్మమ్మ దగ్గరే ఉండిపోయిన మరో కుమార్తె వైష్ణవి అనాథగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని