బిడ్డను చంపి దంపతుల ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్యభర్తలిద్దరూ కలిసి కన్న బిడ్డనే హతమార్చి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఐ శ్యాంసుందర్ తెలిపిన వివరాల ప్రకారం..
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్యభర్తలిద్దరూ కలిసి కన్న బిడ్డనే హతమార్చి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఐ శ్యాంసుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మన్నెగూడెం గ్రామానికి చెందిన అక్కె రాంబాబు(27), కృష్ణవేణి(24)లకు ఐదేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఈ మధ్య కాలంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.ఈ క్రమంలో నెల రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. చిల్కోయిలపాడులో ఉన్న భార్య, 9 నెలల కూతురు చైత్రికను తీసుకొచ్చేందుకు ఇవాళ రాంబాబు అక్కడికి వెళ్లాడు. తిరిగి వస్తూ ద్విచక్రవాహనాన్ని తన పొలం వైపు తీసుకెళ్లి, అక్కడ కూతురు గొంతునులిమి చంపేసి సమీపంలోని నీటి కుంటలో పడేశారు. అనంతరం వీరిద్దరూ అక్కడున్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోవడానికి మునుపు రాంబాబు తన మరదలకి ఫోన్ చేసి తాము చనిపోతున్నట్లు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తల్లిదండ్రులతో రాకుండా అమ్మమ్మ దగ్గరే ఉండిపోయిన మరో కుమార్తె వైష్ణవి అనాథగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.