వరుడే బావమరిదిని చంపేశాడు
ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఓ వివాహ విందులో విషాదం చోటుచేసుకుంది. వివాహ విందు గురించి ఆగ్రహించిన వరుడు.. సొంత బావమరిదినే చంపేశాడు. అంతేకాకుండా తన వాహనంతో బంధువులపైకి దూసుకెళ్లి ముగ్గురుని గాయపరిచాడు. పోలీసులు
ఫరూఖాబాద్: ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఓ వివాహ విందులో విషాదం చోటుచేసుకుంది. వివాహ విందు గురించి ఆగ్రహించిన వరుడు.. సొంత బావమరిదినే చంపేశాడు. అంతేకాకుండా తన వాహనంతో బంధువులపైకి దూసుకెళ్లి ముగ్గురుని గాయపరిచాడు. పోలీసులు ఉత్తర్ప్రదేశ్లోని ఫరుఖాబాద్కి చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. ఈ వివాహ విందులో మిఠాయిలు వడ్డించే విషయంలో వరుడు, అతని స్నేహితులు వధువు తరపు బంధువులతో వాదనకు దిగారు. దీంతో ఘర్షణ పెద్దది కాకుండా ఇతర బంధువులు జోక్యం చేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వరుడు, అతని స్నేహితులు తన మామయ్యపై కాల్పులు జరిపినట్లు వధువు సోదరుడు పునీత్ తెలిపాడు. ఈ ఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నాడు. అనంతరం అక్కడే నీళ్లు అందిస్తున్న తన సోదరుడు ప్రన్షు (9)ను వరుడు, అతని స్నేహితులు తమ వాహనంలో ఎక్కించుకొని వెళ్లారని ఆయన తెలిపాడు. ఈ క్రమంలో వరుడు కారులో వేగంగా వెళుతూ ఇద్దరు మహిళలు, ఒక బాలికను ఢీకొట్టినట్లు తెలిపాడు. అనంతరం కారులో పారిపోయినట్లు పునీత్ పేర్కొన్నాడు. తిరిగి రావాలని వరుడు మనోజ్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను వెనక్కి రాలేదని, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రన్షు మృతదేహాన్ని గ్రామంలో వదిలివెళ్లారని ఆయన వెల్లడించారు. దీంతో వధువు తండ్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రన్షు మెడపై గొంతు నులిమిన గుర్తులున్నాయని వధువు కుటుంబ సభ్యులు పోలీసుల కిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వరుడు, అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
డబ్బు కోసం జూనియర్పై సీనియర్ల దాష్టీకం
తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదనే కారణంతో ఓ యువకుడిపై అతడి సీనియర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. -
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్