వారితో స్నేహం అనూష భర్తకు తెలీదు: డీసీపీ

మేడ్చల్‌ జిల్లా పోచారంలో ఐదేళ్ల చిన్నారి ఆద్య హత్య కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి స్నేహితుడే చిన్నారిపై ఈ ఘాతుకానికి పాల్పడిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం...

Updated : 03 Jul 2020 14:01 IST

ఘట్‌కేసర్‌: మేడ్చల్‌ జిల్లా పోచారంలో ఐదేళ్ల చిన్నారి ఆద్య హత్య కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనా స్థలాన్ని మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితా మూర్తి, ఏసీపీ నరసింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రఘువీరారెడ్డి పరిశీలించారు. హత్యకు గల కారణాలను కాలనీ వాసులతో పాటు అనూష బంధువులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ రక్షితా మూర్తి మాట్లాడుతూ.. కరుణాకర్‌, అనూష మధ్య స్నేహం ఉందనీ.. వారిద్దరి మధ్య ఇటీవల చోటుచేసుకున్న వివాదాలే హత్యకు దారితీశాయని చెప్పారు. 

చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేరనీ.. అనూష, రాజశేఖర్‌, కరుణాకర్‌ గతంలో స్నేహితులని తెలిపారు. కరుణాకర్‌, అనూష మధ్య గొడవలు ఉన్నట్టు రాజశేఖర్‌ చెప్పాడని ఆమె వెల్లడించారు. ఈ ముగ్గురి మధ్య పరిచయంపై అనూష భర్త కల్యాణ్‌కు తెలియదని డీసీపీ తెలిపారు. నిందితుడిని మెరుగైన వైద్యం నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అంతకుముందు ఈసీఐఎల్‌లోని ఓ ఆసుపత్రిలో ఉన్న అనూషతో మాట్లాడి డీసీపీ వివరాలు సేకరించారు. చిన్నారి తల్లి అనూష, ఆమె స్నేహితుడు రాజశేఖర్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు