మద్యం సవాలులో ఓడిన ప్రాణం
ఐదుగురు మిత్రులు కలసి సరదాగా ఏర్పాటు చేసుకున్న విందులో ఒకరి ప్రాణం పోయిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.
మామడ (నిర్మల్): ఐదుగురు మిత్రులు కలసి సరదాగా ఏర్పాటు చేసుకున్న విందులో ఒకరి ప్రాణం పోయిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని మామడ మండలం అనంతపేటలో ఈ ఘటన కొంతమంది మిత్రులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో 20 నిమిషాల్లో మద్యం పుల్ బాటిల్ తాగాలని మిత్రులు వేసిన పందానికి ఖాజా రసూల్(31) అనే వ్యక్తి బలయ్యాడు. వేగంగా మద్యం తాగే క్రమంలో రసూల్ కుప్పకూలిపోయాడు. అతిగా మద్యం తాగేలా రెచ్చగొట్టి రసూల్ మరణానికి కారకులైన రత్తయ్య, నాగూర్ బాషాపై కేసు నమోదు చేసినట్లు సీఐ జీవన్ రెడ్డి తెలిపారు. మృతుని స్వగ్రామం ప్రకాశం జిల్లా కాగా... తెలంగాణలోని లక్ష్మణ్చందా మండలం చింతలచందాలో తాపీ మేస్త్రీగా స్థిరపడ్డాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా