చోరీ కోసం వచ్చి..ఊపిరాడక మృతి!

చోరీకోసం దుకాణం లోనికి చొరబడ్డ వ్యక్తి ఊపిరాడక అక్కడే మరణించిన ఉదంతమిది. షట్టర్‌ మూసేసి వెలుతురు కోసం అగ్గిపుల్ల వెలిగించడంతో అక్కడ ఉన్న శానిటైజర్‌, పెట్రోలుకు అంటుకుని ...

Updated : 13 Sep 2020 09:20 IST

అగ్గిపుల్ల వెలిగించడంతో శానిటైజర్‌, పెట్రోలుకు మంటలు

టేక్మాల్‌: చోరీకోసం దుకాణం లోనికి చొరబడ్డ వ్యక్తి ఊపిరాడక అక్కడే మరణించిన ఉదంతమిది. షట్టర్‌ మూసేసి వెలుతురు కోసం అగ్గిపుల్ల వెలిగించడంతో అక్కడ ఉన్న శానిటైజర్‌, పెట్రోలుకు అంటుకుని మంటలు వ్యాపించాయి. దానికి తోడు గది నిండా పొగ నిండిపోవడంతో ఊపిరాడక శేఖర్‌(35) అనే ఆ దొంగ కన్ను మూశాడు. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం పల్వంచ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం దుకాణ యజమాని స్వామి షట్టరు తీసి చూసే సరికి శేఖర్‌ విగతజీవిగా కనిపించాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ లింబాద్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని