భర్తపై అనుమానం.. జిమ్‌లో మహిళను చితకబాదిన భార్య

భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అతడి భార్య ఓ మహిళపై 

Published : 19 Oct 2021 11:21 IST

భోపాల్‌: భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అతడి భార్య ఓ మహిళపై వ్యాయామశాలలో బూట్లతో దాడికి దిగింది. పక్కనున్నవారు ఆపడానికి ప్రయత్నించినా శాంతించకుండా విచక్షణారహితంగా విరుచుకుపడింది. ఆమె ఎవరో తనకు  తెలియదని భర్త ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. చివరికి భార్యాభర్తలిద్దరూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 15న జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

30 ఏళ్ల ఆ మహిళ బుర్ఖా ధరించి తన సోదరితో కలసి ఓ జిమ్‌కు వచ్చింది. అక్కడ వ్యాయామాలు చేస్తున్న భర్త పక్కన ఉన్న మహిళను చూసింది. భర్తతో ఆమెకు సంబంధం ఉందని అనుమానించింది. ఈ విషయమై అతడితో గొడవకు దిగి.. ఆ మహిళపై ఒక్కసారిగా దాడికి పాల్పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని