Gang Rape: తుపాకీతో బెదిరించి మహిళపై సామూహిక అత్యాచారం

ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. ఇంట్లో

Published : 28 Oct 2021 10:31 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జాలౌన్‌ జిల్లా ఉరయ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామంలో.. ఓ మహిళ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. ఆ సమయంలో నలుగురు యువకులు.. గోడ దూకి, ఇంట్లోకి ప్రవేశించారు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు మహిళ అరిచేందుకు ప్రయత్నించగా ఆమెపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని