ఇంట్లో అయిదు మృతదేహాలు..

దిల్లీలోని షాహ్‌దారా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

Published : 20 Jan 2022 11:02 IST

దిల్లీలోని షాహ్‌దారా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సీమాపురి ప్రాంతంలోని ఓ ఇంటిలో స్టవ్‌ నుంచి వెలువడిన విషవాయువు పీల్చి నలుగురు పిల్లలు సహా తల్లి మృతి చెందటం కలకలం రేపింది. పాత సీమాపుర్‌లోని ఓ భవనంలో ఉన్న ఐదో అంతస్తులో ఐదుగురు అపస్మారక స్థితిలో పడి ఉన్నారని బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫోన్‌ వచ్చిందని పోలీసులు తెలిపారు. సంఘటాస్థలానికి చేరుకుని పరిశీలించగా.. మహిళ సహా ముగ్గురు చిన్నారులు మృతి చెందారని, ఓ పాపను ఆసుపత్రికి తరలించినప్పటికీ కాపాడలేకపోయామన్నారు. ప్రాథమిక విచారణలో ఎలాంటి వెలుతురు లేని గదిలో ఉన్న స్టవ్‌ నుంచి వచ్చిన విషవాయువుల ద్వారానే ఊపిరాడక చనిపోయారని తేలిందని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని