TS News: విష సర్పంతో వింత చేష్టలు.. ఆసుపత్రి పాలైన వ్యక్తి
విష సర్పంతో ఆటలాడుతూ దాన్ని ముద్దాడి కాటుకు గురైన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ (30).. భార్య, ఇద్దరు పిల్లలతో వలస వచ్చి గాజులరామారం డివిజన్ కట్టమైసమ్మ బస్తీలో ఉంటున్నాడు. స్థానిక క్వారీలో రాళ్లు కొడుతుంటాడు.
పామును ముద్దాడుతున్న ఆకాశ్
షాపూర్నగర్, న్యూస్టుడే: విష సర్పంతో ఆటలాడుతూ దాన్ని ముద్దాడి కాటుకు గురైన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ (30).. భార్య, ఇద్దరు పిల్లలతో వలస వచ్చి గాజులరామారం డివిజన్ కట్టమైసమ్మ బస్తీలో ఉంటున్నాడు. స్థానిక క్వారీలో రాళ్లు కొడుతుంటాడు. ఆదివారం రాత్రి జనావాసాల మధ్యకు ఓ విష సర్పం రావడంతో పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న ఆకాశ్కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అతను పామును చాకచక్యంగా పట్టుకుని మెడలో వేసుకుని దాన్ని ముద్దాడుతూ ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ వింత చేష్టలే అతని ప్రాణాల మీదకు తెచ్చాయి. పామును దూరంగా వదిలిపెట్టిన అనంతరం అతను అస్వస్థతకు గురయ్యాడు. పామును ముద్దాడుతున్న సమయంలో అది కాటు వేసినట్లు అందరూ భావిస్తున్నారు. వెంటనే అతన్ని సూరారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్లు వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్