Crime News: కొలువులిప్పిస్తామని రూ. కోటిన్నర స్వాహా!
మెట్రో, దక్షిణ మధ్య రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించి రూ.కోటిన్నర వసూలు చేసిన కాకరపర్తి సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్రెడ్డి(37), దాచిపల్లి సురేష్(33), బానోతు నాగలక్ష్మి(30)లను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు సురేంద్ర, సురేష్
ఈనాడు, హైదరాబాద్: మెట్రో, దక్షిణ మధ్య రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించి రూ.కోటిన్నర వసూలు చేసిన కాకరపర్తి సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్రెడ్డి(37), దాచిపల్లి సురేష్(33), బానోతు నాగలక్ష్మి(30)లను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కాకరపర్తి భాగ్యలక్ష్మి(60), ఆలం, శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు. మంగళవారం నేరెడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనరేట్లో నేరవిభాగం డీసీపీ యాదగిరి, మల్కాజిగిరి ఏసీపీ ఎం.శ్యాంప్రసాద్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ జి.నవీన్కుమార్తో కలిసి సీపీ మహేశ్భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడి పేరు కాకరపర్తి సురేంద్ర. ఖమ్మం జిల్లా మధిర స్వస్థలం. పదో తరగతి వరకు చదివి ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. 2012లోనే ఇంగ్లండ్ నుంచి బంగారం బిస్కెట్లు తక్కువ ధరకు తెప్పిస్తానంటూ స్నేహితుల వద్ద రూ.12 లక్షలు వసూలు చేశాడు. 2013లో ఉప్పల్కు వచ్చి క్యాబ్ డ్రైవర్గా అవతారమెత్తాడు. పుట్టా సురేష్రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్కార్డు తెచ్చుకున్నాడు. భార్య నాగలక్ష్మి, సహాయకుడు దాచిపల్లి సురేష్లతో కలిసి మోసాలకు తెరలేపాడు. రైల్వేలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావు, సికింద్రాబాద్కు చెందిన ఆలంతో ప్రచారం చేయించారు. నిరుద్యోగులను రైల్వే నిలయం వద్దకు తీసుకెళ్లి.. ఆలం, శ్రీనివాసరావులను రైల్వే అధికారులుగా పరిచయం చేశారు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.5-10 లక్షలు వసూలు చేశారు. కొందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. నెలల గడుస్తున్నా ఉద్యోగం లేకపోవటంతో బాధితులు ఆరా తీయగా నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్గా తేలింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూత్రధారి సురేంద్ర 60-70 సిమ్కార్డులు ఉపయోగించినట్లు గుర్తించారు. మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ బృందం, మేడిపల్లి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 15-20 మంది నిరుద్యోగుల నుంచి రూ.1.5-2 కోట్ల వరకు వసూలు చేసిన సురేంద్ర నాలుగు కార్లను కొనుగోలు చేసి ఉప్పల్లో ఓం సాయి ట్రావెల్స్, ఓం సెక్యూరిటీ సర్వీస్ కార్యాలయాలు ప్రారంభించాడు. జడ్చర్ల వద్ద రూ.25 లక్షలతో క్యాంటీన్ ప్రారంభించాడు. బోడుప్పల్ వద్ద తల్లి పేరిట రూ.40 లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు