Hyd News: వైద్యుడి వేషంతో ఐసీయూలోకి అక్రమంగా ప్రవేశించి..
వైద్యుడి వేషంతో ఆసుపత్రి ఐసీయూలోకి ప్రవేశించడమే కాకుండా రోగి బంధువులను డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు.
Updated : 21 May 2022 06:47 IST
పంజాగుట్ట, న్యూస్టుడే: వైద్యుడి వేషంతో ఆసుపత్రి ఐసీయూలోకి ప్రవేశించడమే కాకుండా రోగి బంధువులను డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బంజారాహిల్స్ లోని విరించి ఆసుపత్రిలో చేర్చించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈనెల 16న గుర్తుతెలియని వ్యక్తి వైద్యుడి వేషధారణతో ఐసీయూలోకి వెళ్లాడు. రోగి కేసష్ీట్ను పరిశీలించి ఫోన్ నంబరు తీసుకున్నాడు. రోగి బంధువులకు ఫోన్ చేసి అత్యవసర శస్త్రచికిత్స చేయాలని, తక్షణం రూ.50వేలు పంపించాలని చెప్పాడు. విస్తుపోయిన బంధువులు తమకు ఈఎస్ఐ వర్తిస్తుందని, డబ్బులెందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఆసుపత్రి యాజమాన్యం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుణ్ని సంతోష్నగర్కు చెందిన మహ్మద్ జకీరుద్దీన్(19)గా గుర్తించి రిమాండ్కు తరలించారు.
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.