తెనాలిలో క్రికెట్ బుకీ అరెస్టు
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో పెద్దఎత్తున బెట్టింగు నిర్వహిస్తున్న ఓ బుకీని గుంటూరు జిల్లా, తెనాలి వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్స్టేషన్లో ..
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు
తెనాలి టౌన్, న్యూస్టుడే: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో పెద్దఎత్తున బెట్టింగు నిర్వహిస్తున్న ఓ బుకీని గుంటూరు జిల్లా, తెనాలి వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన సమావేశంలో డీఎస్పీ డాక్టర్ కె.స్రవంతిరాయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఉప్పుబజార్లో ఉన్న ఓ ఇంటిలో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బెట్టింగ్ నమోదుల ప్రధాన బుకీ జి.వెంకట్, అతని సహాయకుడు వెంకటేష్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ల్యాప్ట్యాప్, 8 స్మార్ట్ఫోన్లు, 9 కీప్యాడ్ ఫోన్లను కలిగి ఉన్న లైన్ బాక్స్, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన వెంకట్ గతంలోనూ ఈ తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చరవాణులు, ఇతర సాంకేతిక పరికరాల విశ్లేషణ తర్వాత ఇందులో ఎంత మంది పాల్గొన్నారు? వారు ఎవరు? ఏమేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి.. తదితర సమాచారాన్ని సేకరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న వన్టౌన్ పోలీసులను ఆమె అభినందించారు. సమావేశంలో సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు ఉమామహేశ్వరరావు, చాణక్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రధాన నిందితుడు వెంకట్ బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తుంటాడని, ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ అతని సిబ్బంది ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పక్కా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం