వ్యాపారి హత్యతో అట్టుడికిన బేగంబజార్!
యువ వ్యాపారి నీరజ్ పన్వర్ హత్యతో బేగంబజార్ ప్రాంతం అట్టుడికి పోయింది. బేగంబజార్ కోల్సావాడీకి చెందిన యువ వ్యాపారి నీరజ్ పన్వర్ అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
బేగంబజార్లో మూత పడిన దుకాణాలు
గోషామహల్, న్యూస్టుడే: యువ వ్యాపారి నీరజ్ పన్వర్ హత్యతో బేగంబజార్ ప్రాంతం అట్టుడికి పోయింది. బేగంబజార్ కోల్సావాడీకి చెందిన యువ వ్యాపారి నీరజ్ పన్వర్ అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేకపోయిన సంజన కుటుంబీకుల్లోని కొందరు శుక్రవారం రాత్రి బేగంబజార్ చేపల మార్కెట్ వద్ద నీరజ్ పన్వర్ను హత్య చేసిన విషయం తెలిసిందే.
మార్కెట్ బంద్.. పీఎస్ ముందు ధర్నా..
హత్యకు నిరసనగా హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, బేగంబజార్ రెసిడెన్షియల్ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం బేగంబజార్లో వ్యాపారులందరూ దుకాణాలు తెరవలేదు. ఉదయం పదిన్నర గంటలకు బేగంబజార్ మిట్టీకా షహర్ నుంచి వందలాది మంది వ్యాపారులు, బాధితుడి కుటుంబసభ్యులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టి షాయినాయత్గంజ్ పోలీసుస్టేషన్కు చేరుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాధితుడి కుటుంబీకులు, బంధువులతో పాటు అతని భార్య సంజన ఈ ధర్నాలో పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. డీసీపీ డేవిస్ జోయల్, ఏసీపీ సతీశ్కుమార్, సీఐ అజయ్కుమార్లు ఎమ్మెల్యేతో పాటు వ్యాపార సంఘం ప్రతినిధులతో మాట్లాడారు.
నా సోదరులే హత్య చేశారు: సంజన
నా భర్తను మా సోదరులే హత్య చేశారని నీరజ్ పన్వర్ భార్య సంజన విలపించింది. షాయినాయత్గంజ్ పీఎస్ ఎదురుగా ధర్నాలో పాల్గొన్న ఆమె విలేఖరులతో మాట్లాడింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తాను చేసిన పాపమా..? అని ప్రశ్నించింది. తన భర్తను హతమార్చిన వారందరికీ ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరింది.
* యువ వ్యాపారి నీరజ్ పన్వర్ మృతదేహానికి ఉస్మానియాలో సాయంత్రం నాలుగున్నర గంటలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
అంతిమయాత్రకు తరలివచ్చిన జనం
హెచ్ఆర్సీ నోటీసులు
నారాయణగూడ: శుక్రవారం రాత్రి బేగంబజార్లో జరిగిన హత్యపై ఎస్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ ఈ కేసును సూమోటోగా విచారణకు స్వీకరించింది.ఈ సంఘటనపై జూన్ 30లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
బందోబస్తు మధ్య అంతిమయాత్ర
ఉస్మానియా ఆసుపత్రి: నీరజ్ పన్వర్ మృతదేహానికి ఫోరెన్సిక్ వైద్యురాలు ఝాన్సీ ఆధ్వర్యంలో పరీక్షలు ఉస్మానియాలో నిర్వహించారు. స్థానికుల అభ్యర్థన మేరకు కోల్సావాడీ వద్ద నుంచి అంతిమయాత్ర కాలినడకన బేగంబజార్ నుంచి ఇమ్లిబన్ శ్మశాన వాటిక వరకూ సాగింది. ఇమ్లిబన్ శ్మశాన వాటికలో సాయంత్రం మృతదేహానికి అతని సోదరుడు దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడి కుటుంబీకుల్ని తెరాస రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్(బిలాల్), ఆనంద్ కుమార్గౌడ్, వ్యాపార సంఘాల ప్రతినిధులు పరామర్శించి ధైర్యం చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా