Saidabad: సైదాబాద్ కేసు ముగియాలంటే ఈ రెండు అంశాలు కీలకం!
చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన దారుణంలో రాజు ఒక్కడిదే పాత్ర అని ఇప్పటివరకు ఉన్న ఆధారాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. ఈనేపథ్యంలో కేసును మూసేయాల్సిన
ఈనాడు, హైదరాబాద్: చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన దారుణంలో రాజు ఒక్కడిదే పాత్ర అని ఇప్పటివరకు ఉన్న ఆధారాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. ఈనేపథ్యంలో కేసును మూసేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే సాంకేతికంగా అందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు రెండు అంశాలు కీలకం కానున్నాయి. ఒకటి మృతదేహం రాజుదే అని సాంకేతికంగా రుజువు చేయడం. రెండోది హత్యాచారం చేసింది రాజే అని నిరూపించడం. మృతదేహం రాజుదే అనేందుకు డీఎన్ఏ నమూనాను విశ్లేషించనున్నారు. రక్త సంబంధీకుల డీఎన్ఏతో పోల్చి నిర్ధారించనున్నారు. మరోవైపు ఘటనాస్థలి నుంచి చిన్నారి దుస్తుల్ని క్లూస్ బృందాలు స్వాధీనం చేసుకున్న దృష్ట్యా వాటిపై నిందితుడి సెమన్(వీర్యం) నమూనాల్ని సేకరించినట్లుగా చెబుతున్నారు. అది రాజుదే అని నిరూపించగలిగితేనే ఈ కేసులో అతనే నిందితుడు అని సాంకేతికంగా నిర్ధారణ అవుతుంది. అటు డీఎన్ఏ.. ఇటు వీర్య నమూనాల విశ్లేషణ అంతా ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలతో ముడిపడి ఉంది. ఎఫ్ఎస్ఎల్ నుంచి ఆ రెండు నివేదికలు అందిన తర్వాత న్యాయస్థానంలో వాటిని సమర్పించిన తర్వాతే కేసు ముగియనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!