Cheating: ఏడాదిలో రెట్టింపు చేస్తానని.. రూ.కోట్లల్లో టోకరా!
మూడు రాష్ట్రాల్లో అతను 21 కేసుల్లో నిందితుడు. రోజుల వ్యవధిలోనే రూ.కోట్లు కొల్లగొట్టాడు. చివరికి కొందరు బాధితులు అతడిని పట్టుకొని అప్పగించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డిపాజిట్లపై రెట్టింపు డబ్బులిస్తానని నమ్మబలికి రూ.కోట్లలో టోకరా
ఈనాడు డిజిటల్-కర్నూలు, ఆత్మకూరు పట్టణం-న్యూస్టుడే: మూడు రాష్ట్రాల్లో అతను 21 కేసుల్లో నిందితుడు. రోజుల వ్యవధిలోనే రూ.కోట్లు కొల్లగొట్టాడు. చివరికి కొందరు బాధితులు అతడిని పట్టుకొని అప్పగించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలులో వర్థన్ మల్టీ స్టేట్ కో-ఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ సంస్థను ప్రారంభించిన ఆ నిందితుడు మహేష్ అలియాస్ జాషువా ఏడాదిలోగా డిపాజిట్లపై రెట్టింపు డబ్బు ఇస్తానని మోసం చేసి జనాలకు రూ.కోట్లల్లో టోకరా వేశాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఈ నిందితుడు గత ఏడాది ఆత్మకూరులో వర్థన్ సొసైటీ బ్రాంచిని ఏర్పాటు చేశారు. ఏజెంట్లను నియమించుకొని కర్నూలు, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, డోన్, పత్తికొండ, నంద్యాల ప్రాంతాల్లో ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించాడు. జమ చేసిన డబ్బులకు ఏడాదిలోగా రెట్టింపు ఇస్తానంటూ ఎర వేశాడు. తొలుత కొందరు చేసిన రూ.20వేల డిపాజిట్లకు రెండు, మూడు నెలల వ్యవధిలో రెట్టింపు డబ్బులు చెల్లించాడు. గ్యారెంటీగా బ్యాంకు చెక్కులను డిపాజిటర్లకు ఇచ్చి నమ్మబలికాడు. తీరా బ్యాంకులో వాటిని జమ చేయడానికి వెళితే ఖాతాలో డబ్బుల్లేవని అక్కడి సిబ్బంది చెప్పడంతో బాధితులు లబోదిబోమన్నారు. మోసపోయామని గ్రహించారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్థన్ సొసైటీ ఛైర్మన్ మహేష్ అలియాస్ జాషువాపై 420, 120బి చీటింగ్, 34 యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు, పత్తికొండకు చెందిన కొందరు బాధితులు ఇటీవల అతడిని పట్టుకొని కర్నూలు త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. వారు అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. సోమవారం సాయంత్రం నిందితుడిని కర్నూలు కోర్టుకు తీసుకురాగా మంగళవారం ఉదయం హాజరుపర్చాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు