Crime News: ఎస్సై పరీక్షకు హాజరైన యువతిపై కదిలే కారులో అత్యాచారం
సామాజిక మాధ్యమాల్లో చేసే కొన్ని స్నేహాలు ఎంత చేటు చేస్తాయో తెలిపే సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని మథురలో జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన 21 ఏళ్ల యువతిని.. ఓ యువకుడు కదులుతున్న కారులో అత్యాచారం చేశాడు. బాధిత యువతి
యూపీలో దారుణం
మథుర: సామాజిక మాధ్యమాల్లో చేసే కొన్ని స్నేహాలు ఎంత చేటు చేస్తాయో తెలిపే సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని మథురలో జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన 21 ఏళ్ల యువతిని.. ఓ యువకుడు కదులుతున్న కారులో అత్యాచారం చేశాడు. బాధిత యువతి ఎస్సై పరీక్షకు హాజరై తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత యువతికి.. హరియాణాలోని పాల్వాల్కు చెందిన తేజ్వీర్ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తాను ఆగ్రాలో ఎస్సై రాత పరీక్షకు హాజరవుతున్నట్లు యువతి చెప్పింది. దీనిని అదనుగా భావించిన ఆ యువకుడు... మంగళవారం తన డ్రైవర్తో కారులో బయలుదేరి ఆమె పరీక్ష రాస్తున్న కేంద్రానికి చేరుకున్నాడు. పరీక్ష రాసి వస్తున్న ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. తర్వాత ఆమెకు మత్తు మందిచ్చి కదులుతున్న కారులోనే అత్యాచారం చేశాడు. స్పృహ తప్పి పడిపోగానే ఆగ్రా-దిల్లీ హైవే పక్కన వదిలేసి వెళ్లిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు