Suicide: ఐదుగురు కుమార్తెలతో బావిలోకి దూకిన తల్లి
భర్త వేధింపులు భరించలేక.. ఓ భార్య తన ఐదుగురు మైనర్ కుమార్తెలతో బావిలోకి దూకిన ఘటన రాజస్థాన్లోని కోటా జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఆమె సహా ఐదుగురు చిన్నారులూ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం..
రాజస్థాన్లోని కోటాలో హృదయ విదారక ఘటన
ఈనాడు, జైపుర్: భర్త వేధింపులు భరించలేక.. ఓ భార్య తన ఐదుగురు మైనర్ కుమార్తెలతో బావిలోకి దూకిన ఘటన రాజస్థాన్లోని కోటా జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఆమె సహా ఐదుగురు చిన్నారులూ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కాలియా ఖేడీ గ్రామంలో నివసిస్తున్న శివ్లాల్ బంజారా, అతని భార్య బాదం దేవి(40) తరచూ గొడవలు పడేవారు. శనివారం రాత్రి భర్త సమీప బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తన ఐదుగురు కుమార్తెలతో బాదందేవి బయటకు వెళ్లారు. ఆదివారం ఉదయం గ్రామానికి సమీపంలోని బావిలో వారంతా శవాలుగా తేలారు. బాదంతో పాటు సావిత్రి(14), అంకలి(8), కాజల్(6), గుంజన్(4), అర్చన(1) మృతి చెందారు. శివ్లాల్ దంపతులకు మరో ఇద్దరు కుమార్తెలు గాయత్రి (15), పూనమ్ (7) కూడా ఉన్నారు. బాదం బయటికి వెళ్లే సమయంలో వారు గాఢనిద్రలో ఉండటంతో ప్రాణాపాయం తప్పించుకోగలిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!