అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం
ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమెర్ల గ్రామానికి చెందిన దంపతులు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగుచూసింది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... వంటిపెంట లక్ష్మీనరసయ్య(57),
పామూరు, న్యూస్టుడే: ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమెర్ల గ్రామానికి చెందిన దంపతులు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగుచూసింది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... వంటిపెంట లక్ష్మీనరసయ్య(57), ఆయన భార్య వెంకటలక్ష్మమ్మ(50) దంపతులు మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి పామూరు చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు కొనుగోలు చేసి.. చిలకపాడు గ్రామ పొలాల్లోకి వెళ్లారు. అక్కడే పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. కుటుంబ అవసరాల కోసం రూ.40 లక్షలకుపైగా అప్పు చేయడం, డబ్బులు ఇచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తుండటంతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!