Crime News: రేణిగుంటలో దారుణం..భర్తను చంపి.. తల, మొండెం వేరు చేసి..
భర్తను భార్య దారుణంగా పొడిచి చంపిన ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో గురువారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ అంజుయాదవ్ కథనం మేరకు.. స్థానిక పోలీసు లైన్ వీధిలో కాపురం ఉంటున్న శ్రీభాష్యం రవిచంద్ర సూరి(53) స్వగ్రామం గుంటూరు జిల్లా నరసరావుపేట. రేణిగుంట పారిశ్రామికవాడలో చిన్న రీసైకిల్ పరిశ్రమ నడుపుతున్నారు. ఆయనకు భార్య వసుంధర, కుమారుడు ఉన్నారు. సూరి మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని వసుంధర తట్టుకోలేకపోయింది. తనను,...
తలతో పోలీసుస్టేషన్లో లొంగిపోయిన వివాహిత
రేణిగుంట, న్యూస్టుడే: భర్తను భార్య దారుణంగా పొడిచి చంపిన ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో గురువారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ అంజుయాదవ్ కథనం మేరకు.. స్థానిక పోలీసు లైన్ వీధిలో కాపురం ఉంటున్న శ్రీభాష్యం రవిచంద్ర సూరి(53) స్వగ్రామం గుంటూరు జిల్లా నరసరావుపేట. రేణిగుంట పారిశ్రామికవాడలో చిన్న రీసైకిల్ పరిశ్రమ నడుపుతున్నారు. ఆయనకు భార్య వసుంధర, కుమారుడు ఉన్నారు. సూరి మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని వసుంధర తట్టుకోలేకపోయింది. తనను, కుమారుడిని రోడ్డున పడేస్తారేమోనని భయాందోళన చెందారు. ఈ విషయమై పలుమార్లు భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఉదయం ఇంట్లో సూరి అల్పాహారం తింటుండగా కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం మొండెం, తల వేరు చేసి సంచిలో తల వేసుకుని కుమారుడిని వెంటబెట్టుకొని పోలీసుస్టేషన్లో లొంగిపోయింది. సీఐ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. పోలీసుల విచారణలో వసుంధర వింతగా ప్రవర్తించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్