బాలికను బెదిరించి.. ఏడాదిగా నలుగురి అత్యాచారం
శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలంలో నలుగురు వ్యక్తులు ఓ బాలికను బెదిరించి అత్యాచారం చేస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.
తలుపుల, న్యూస్టుడే: శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలంలో నలుగురు వ్యక్తులు ఓ బాలికను బెదిరించి అత్యాచారం చేస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శరత్చంద్ర తెలిపిన మేరకు వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఆవులను మేపేందుకు అడవికి వెళ్లేది. అదే గ్రామానికి చెందిన గొర్రెలు మేపే కుమార్ అనే వ్యక్తి ఏడాది కిందట బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న చంద్రబాబు అనే వ్యక్తి ఈ విషయాన్ని ఊళ్లో అందరికీ చెబుతానని బెదిరించి అఘాయిత్యం చేశాడు. నరేంద్ర, సురేష్ అనే మరో ఇద్దరు సైతం అత్యాచారానికి ఒడిగట్టారు. ఇలా బెదిరిస్తూ తరచూ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఇందులో కుమార్కు పెళ్లయింది. మిగిలిన ముగ్గురూ బాలికకు సోదరుల వరుస అవుతారు. బాలిక తల్లి గురువారం ఫిర్యాదు చేయడంతో నలుగురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM