ఎందుకు తాగుతున్నావన్నందుకు కుమార్తెలను కొట్టి చంపిన తండ్రి
తరచూ మద్యం తాగి ఇంటికి వస్తున్న తండ్రిని ప్రశ్నించినందుకు ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీశాడు ఆ కర్కోటకుడు. పేగు బంధం మరిచి.. ప్రాణాలు పోయేదాకా కొట్టాడు.
శ్రీపెరంబుదూర్ (చెన్నై), న్యూస్టుడే: తరచూ మద్యం తాగి ఇంటికి వస్తున్న తండ్రిని ప్రశ్నించినందుకు ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీశాడు ఆ కర్కోటకుడు. పేగు బంధం మరిచి.. ప్రాణాలు పోయేదాకా కొట్టాడు. తమిళనాడులో జరిగిన ఈ దారుణంపై పోలీసుల కథనం మేరకు.. కాంచీపురం జిల్లా ఒరగడం సమీపంలోని చిన్న మదురైపాక్కం గ్రామానికి చెందిన గోవిందరాజ్ కూలీ పనులు చేస్తుంటాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు. వీరిలో నందిని(16) ప్లస్టూ, దీప(10) ఐదో తరగతి చదువుతున్నారు. పరీక్షలకు ఇంటి వద్ద సిద్ధమవుతున్నారు. కొద్ది రోజులుగా గోవిందరాజ్ తాగుడుకు బానిసై ఏ పనీ చేయడం లేదు. అతని భార్యే ప్రైవేటు సంస్థలోకి పనులకు వెళ్తోంది. శుక్రవారం గోవిందరాజ్ తాగి ఇంటికి వచ్చాడు. విసిగిపోయిన కుమార్తెలు అతన్ని నిలదీశారు. మత్తులో ఉన్న గోవిందరాజ్ కర్రతో ఇద్దర్నీ విచక్షణారహితంగా కొట్టగా.. వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి నిందితున్ని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి