ఆన్లైన్ బెట్టింగులకు అలవాటుపడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని భజంత్రీ వీధిలో ఉంటున్న బీటెక్ విద్యార్థి దిలీప్రెడ్డి(20) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అద్దెకు ఉంటున్న గదిలో పైకప్పునకు పంచెతో
పలమనేరు, న్యూస్టుడే: చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని భజంత్రీ వీధిలో ఉంటున్న బీటెక్ విద్యార్థి దిలీప్రెడ్డి(20) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అద్దెకు ఉంటున్న గదిలో పైకప్పునకు పంచెతో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం గ్రామానికి చెందిన దిలీప్ పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగులకు అలవాటుపడ్డాడు. అందులో తీవ్రంగా నష్టం రావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.