మహిళను నిర్బంధించారని అయిదుగురు జీఎస్టీ అధికారులపై కేసు
హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న భరణి కమోడిటీస్ యజమాని జేఎస్ శ్రీధర్రెడ్డి భార్య రాఘవిరెడ్డిని నిర్బంధించారని పంజాగుట్ట పోలీసులు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, పంజాగుట్ట: హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న భరణి కమోడిటీస్ యజమాని జేఎస్ శ్రీధర్రెడ్డి భార్య రాఘవిరెడ్డిని నిర్బంధించారని పంజాగుట్ట పోలీసులు అయిదుగురు జీఎస్టీ అధికారులపై కొద్దిరోజుల క్రితం కేసు నమోదు చేశారు. తన భర్త నిర్వహిస్తున్న వ్యాపారంలో అక్రమాలున్నాయని, రూ.5 కోట్లు ఇస్తే మాఫీ చేస్తామంటూ జీఎస్టీ అధికారులు తనను మూడేళ్ల క్రితం నిర్బంధించారని రాఘవిరెడ్డి దిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ను గతేడాది మార్చిలో ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ సభ్యులు ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. ఈ మేరకు జీఎస్టీ ప్రధాన కార్యాలయంలో అప్పట్లో విధులు నిర్వహించిన అధికారులు బొల్లినేని గాంధీ, చిలుకా సుధారాణి, ఇసబెల్లా బ్రిట్టో, ఆనంద్కుమార్, శ్రీనివాసరావులపై ఐపీసీ 354, 301, 506 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు శుక్రవారం పంజాగుట్ట ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..