అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

‘వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం.. మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, ఘటన జరిగిన తీరుపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది..

Published : 22 May 2022 05:52 IST

వైకాపా ఎమ్మెల్సీ మాజీ డ్రైవరు మృతిపై డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: ‘వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం.. మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, ఘటన జరిగిన తీరుపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది.. పోస్టుమార్టం, వైద్య నివేదికలు  అందిన తర్వాత పూర్తిస్థాయి విచారణ చేపట్టి త్వరగా పూర్తి చేస్తాం’ అని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్‌హాల్‌లో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నేరాల నియంత్రణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో డీజీపీ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలు గతంలో మాదిరిగానే ప్రస్తుత త్రైమాసికంలో నమోదయ్యాయి. హత్యలు, వరకట్న మరణాలు, అత్యాచారాల సంఖ్య గతం కంటే తగ్గింది. మాజీ మంత్రి నారాయణ కేసులో సమన్వయం చేయలేని ఒకరిపై చర్యలు తీసుకున్నాం.తిరుపతి-చిత్తూరు సరిహద్దుల్లో మూతపడ్డ చెక్‌పోస్టులను ప్రారంభించేందుకు చర్చిస్తాం’ అని డీజీపీ తెలిపారు. ఈ సమావేశంలో అనంతపురం డీఐజీ రవిప్రకాష్‌, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, రిషాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని