బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం

నేరెడ్‌మెట్‌లో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతంగా ముగిసింది. మల్కాజిగిరి నేరెడ్‌ మెట్‌ కాకతీయ నగర్‌కు చెందిన సుమేధ కపురియా(12) నిన్న...

Published : 19 Sep 2020 00:29 IST

మేడ్చల్‌ : నేరెడ్‌మెట్‌లో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతంగా ముగిసింది. మల్కాజిగిరి నేరెడ్‌ మెట్‌ కాకతీయ నగర్‌కు చెందిన సుమేధ కపురియా(12) నిన్న సాయత్రం ఇంటి నుంచి సైకిల్‌పై బయటకు వెళ్లింది. ఎంత సేపటికి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకుగురైన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి దీన్‌దయాళ్‌నగర్‌లో నాలాలు పొంగిపొర్లాయని స్థానికులు తెలపడంతో పోలీసులు ఆ దిశగా గాలింపు చేపట్టారు. నాలాలో ప్రమాదవశాత్తూ పడిపోయి ఉండొచ్చనే అనుమానంతో శుక్రవారం ఉదయం నుంచి జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు, రెస్క్యూ టీమ్‌లతో గాలింపు చేపట్టారు. మరో వైపు సీసీ కెమెరాలో ఉన్న వీడియో పరిశీలించగా సైకిల్‌పై వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈరోజు మధ్యాహ్నం నాలాలో సైకిల్‌ దొరకడంతో గాలింపు మరింత ముమ్మరం చేశారు. చివరికి నాలా సమీపంలో ఉన్న బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తూ నాలాలో పడి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని