పార్టీల ప్రచారం.. పిడిగుద్దుల వర్షం

గుజరాత్‌లో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా భాజపా, కాంగ్రెస్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వడోదరాలోని తలావ్‌ ప్రాంతంలో ఎదురుపడ్డ భాజపా, కాంగ్రెస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు....

Updated : 21 Feb 2021 01:41 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా భాజపా, కాంగ్రెస్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం వడోదరాలోని తలావ్‌ ప్రాంతంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ర్యాలీ నిర్వహించాయి. ఈ సమయంలో ఎదురుపడ్డ భాజపా, కాంగ్రెస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. అసభ్య పదజాలంతో దూషించుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. దీంతో రంగంలోని దిగిన ఇరు పార్టీల ముఖ్య నేతలు గొడవను అదుపులోకి తెచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని