Crime News: జగిత్యాలలో మంత్రాల నెపంతో ముగ్గురుని హత్య చేసిన నిందితుల అరెస్ట్‌

జగిత్యాలలో ఇటీవల జరిగిన సంచలనం సృష్టించిన మూడు హత్యలకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు.

Published : 24 Jan 2022 02:00 IST

జగిత్యాల: జగిత్యాలలో ఇటీవల జరిగిన సంచలనం సృష్టించిన మూడు హత్యలకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. జగిత్యాలలో ఈ నెల 20న మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. మృతి చెందిన వారిలో తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌ ఉన్నారు. దీంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ రోజు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.9.42 లక్షలు, 6 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వీరి హత్య కేసులో మొత్తం 24 మందిపై కేసులు నమోదయ్యాయి.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు