Karnataka: లారీని ఢీకొని జీపు బోల్తా.. ఏడుగురి మృతి

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామణి వద్ద ఓ లారీని ఢీకొని జీపు బోల్తా పడింది

Published : 13 Sep 2021 01:22 IST

బెంగళూరు: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామణి వద్ద ఓ లారీని ఢీకొని జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని