బాలిక కిడ్నాప్‌.. స్పృహలేని స్థితిలో ఆచూకీ

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పరిధి దమ్మాయిగూడలో దారుణం చోటు చేసుకుంది.

Updated : 05 Jul 2021 10:21 IST

మేడ్చల్‌‌: మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పరిధి దమ్మాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. తాపీ మేస్త్రీ శ్రీను నిన్న సాయంత్రం ఆరేళ్ల బాలికను అపహరించాడు. ఈ ఉదయం చిన్నారిని ప్రగతినగర్‌లో వదిలిపెట్టాడు. ఒంటిపై గాయాలతో స్పృహలేని స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించారు. అక్కడే ఉన్న నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలికను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసి గాలింపు చర్యల్లో ఉండగా స్థానికులు ద్వారా పోలీసులకు బాలిక సమాచారం అందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని