Gujarat: అమ్మవారు ఆవహించిందని మహిళను కొట్టి చంపారు!

గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో అమానుషానికి ఒడిగట్టారు.....

Published : 16 Oct 2021 02:13 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో అమానుషానికి ఒడిగట్టారు. కోపంతో ఉన్న దేవత పూనిందని.. ఆమె అందరినీ చంపేస్తుందేమోనని భయపడి ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆరంభదా గ్రామానికి చెందిన రమీలా సోలంకి అనే మహిళ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం సమీపంలోని ఒఖంబది గ్రామానికి భర్తతో కలిసి వెళ్లింది. అయితే ఉత్సవాల్లో పాల్గొన్న రమీలా ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ప్రవర్తించింది.

అయితే ఆమెకు కోపంతో ఉన్న అమ్మవారు పూనిందని అక్కడే ఉన్న భూతవైద్యుడు రమేశ్‌ సోలంకి అక్కడి ప్రజలను నమ్మించాడు. కోపంతో ఉన్న అమ్మవారిని పారద్రోలాలని.. లేదంటే ఆమె అందరిని చంపేస్తుందని భయపెట్టాడు. కోపంతో ఉన్న అమ్మవారిని వెళ్లగొట్టేందుకు రమీలాను కొట్టాలని సూచించాడు. దీంతో అక్కడ ఉన్న ఆమె బంధువులు కర్రలు, మంటల్లో వేడి చేసిన ఇనుప గొలుసులతో  రమీలాను చావబాదారు. దీంతో ఆమె తీవ్ర గాయాలతో మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలో పాల్గొన్న ఐదుగురిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని