వైద్య ఖర్చుల కోసం.. బ్యాంక్ దోపిడీ యత్నం!
ఓ వ్యక్తికి వైద్య ఖర్చులు, అప్పులు తీర్చడం కోసం డబ్బులు అవసరమయ్యాయి. ఉన్నఫలంగా అంత డబ్బు ఎలా తేవాలో అర్థం కాగా.. ఏకంగా బ్యాంక్లో దోపిడీ చేయాలనుకున్నాడు. ఇందుకోసం మహారాష్ట్రలో వార్ధ నగరంలోని సెవాగ్రామ్ ప్రాంతంలో ఉన్న ఓ బ్యాంకును ఎంచుకున్నాడు. గత శుక్రవారం మధ్యాహ్నం ముఖానికి మాస్క్ను ధరించి, నేరుగా
ముంబయి: ఓ వ్యక్తికి వైద్య ఖర్చులు, అప్పులు తీర్చడం కోసం డబ్బులు అవసరమయ్యాయి. అంత డబ్బు ఎలా తేవాలో అర్థం కాగా.. ఏకంగా బ్యాంక్లో దోపిడీ చేయాలనుకున్నాడు. ఇందుకోసం మహారాష్ట్రలో వార్ధ నగరంలోని సేవాగ్రామ్ ప్రాంతంలో ఉన్న ఓ బ్యాంకును ఎంచుకున్నాడు. గత శుక్రవారం మధ్యాహ్నం ముఖానికి మాస్క్ను ధరించి, నేరుగా బ్యాంక్లోకి వెళ్లాడు. క్యాష్ కౌంటర్ వద్దకి వెళ్లి 15 నిమిషాల్లో రూ. 55లక్షలు ఇవ్వాలని.. లేదంటే తన వద్ద ఉన్న బాంబును పేల్చేస్తానని బెదిరిస్తూ ఓ లేఖ అందించాడు. అది చూసి బ్యాంక్ సిబ్బంది కంగుతిన్నారు. ఆత్మాహుతి దాడి చేసుకుంటానని హెచ్చరించడంతో బ్యాంక్లో భయానక వాతావరణం నెలకొంది.
అయితే, బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై ఎదురుగానే ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే బ్యాంక్కు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బాంబు నకిలీదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక డిజిటల్ గడియారం, ఆరు పైపులకు వైర్లు అతికించి పెట్టాడనని గుర్తించారు. అలాగే అతని నుంచి కత్తి, ఎయిర్ పిస్టోల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు యోగేశ్ కుబాడేగా పోలీసులు గుర్తించారు. సైబర్ కేఫ్ను నిర్వహించే అతడు.. తన అప్పులు, వైద్య ఖర్చుల కోసం బ్యాంక్ దోపిడీకి యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం