Maoist Sharadakka: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క
మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు
హైదరాబాద్: మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. 1994లో దళంలో చేరిన ఆమె అప్పటి కమాండర్ హరిభూషణ్ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ప్లాటూన్ కమాండర్గా, సెంట్రల్ కమిటీ కమాండర్గానూ శారదక్క పని చేశారు. 2006లో జరిగిన ఎన్కౌంటర్లో బుల్లెట్ తగిలి ఒక కన్ను కోల్పోయారు. 2007లో ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఆమె, 2011లో మరోసారి హరిభూషణ్తో కలిసి మావోయిస్ట్ పార్టీలో చేరారు. హరిభూషణ్ బతికి ఉన్నన్ని రోజులు శారదక్కకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉండేది. అతని మరణం తర్వాత మావోయిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆమె అనాసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో దళాన్ని వీడాలని నిర్ణయించుకుని, తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత ఆరు నెలల్లో 20 మంది మావోయిస్టులు మావోయిస్ట్ పార్టీని వీడి జన జీవన స్రవంతిలో కలిసినట్లు శారద చెప్పారు. హింస ద్వారా ఏమీ సాధించలేమని, మిగతా మావోయిస్టులు కూడా లొంగి పోవాలని పోలీసుల ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణా మావోయిస్ట్ రాష్ట్ర కమిటీలో 115 మంది ఉన్నారు. వీళ్లలో తెలంగాణకు చెందిన వాళ్లు కేవలం 15 మంది. మిగతా వాళ్లంతా గోతికోయలే. కేంద్ర కమిటీ సభ్యులైన ఆజాద్, రాజీరెడ్డి లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు అడ్డుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడే మావోయిస్టులందరూ లొంగిపోండి. శారద జనజీవన స్రవంతిలోకి వచ్చినందుకు 5 లక్షల రివార్డ్తో పాటు తాత్కాలిక సాయంగా రూ.5 వేల నగదు ఇస్తున్నాము’’ అని అన్నారు.
మరోవైపు మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. చాలా మంది మావోయిస్టులకు కరోనా సోకింది. అడవుల్లో సరైన వైద్య సదుపాయాలు అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దామోదర్ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ నుంచి మావోయిస్ట్ దళంలోకి నూతనంగా ఎవరూ చేరడం లేదు. కేంద్ర కమిటీలో 25 మంది ఉన్నారు. వారిలో 11 మంది తెలంగాణ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. మిగతా 11 మంది ఇతర రాష్ట్రాల వాళ్లు. కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..